దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం : సీపీఎం

by  |
cpm madhu
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు జరుపుతున్న దాడులను సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. తక్షణమే ఈ దాడులను ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ నేతలు సీఎం పట్ల అనుచితంగా మాట్లాడి ఉంటే దాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప ఈ రకంగా భౌతిక దాడులకు పూనుకోవడం సరికాదన్నారు. తక్షణమే సీఎం జోక్యం చేసుకుని రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని కోరారు. టీడీపీ కూడా రాజకీయ విమర్శలు హుందాగా చేయాలే తప్ప, వ్యక్తిగతం చేయడం తప్పు అని పి.మధు హితవు పలికారు.


Next Story

Most Viewed