వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య దాడులు.. ఒకరు మృతి

by  |
వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య దాడులు.. ఒకరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎపీలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య దాడులు పెరుగుతున్నాయి, నాలుగు రోజుల క్రితం కర్నూలులో ఇరువర్గాల మధ్య దాడితో ఇద్దరు మరణించారు. అది మరవక ముందే ప్రకాశం జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని సంతమాగులూరు మండలం కామేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. కర్రలు, ఇనుపరాడ్లతో పరస్పరం ఇరువర్గాలు దాడిగి దిగారు. అయితే ఈ దాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుడు లక్కిపోగు సుబ్బారావు అనే వ్యక్తి గుర్తించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన వారిని కుటుంబసభ్యులు నర్సరావుపేట ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed