- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం మత్తులో పంచాయతీ కార్యదర్శిపై దాడి
by Batti.Sumithra |
<p>దిశ, డోర్నకల్: తాగిన మైకంలో ఓ వ్యక్తి పంచాయతీ కార్యదర్శిపై దాడి చేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం డీఎస్ఆర్ జెండాలు తండాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జెండాలు తండాలో ఎండీ యాకూబ్ పాషా పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఆయన విధులకు హాజరై కార్యాలయంలో సర్పంచ్తో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో తండాకు చెందిన ధరవట్ చిరంజీవి అనే వ్యక్తి తాగి వచ్చి కార్యదర్శి, సర్పంచ్తో […]</p>

X
దిశ, డోర్నకల్: తాగిన మైకంలో ఓ వ్యక్తి పంచాయతీ కార్యదర్శిపై దాడి చేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం డీఎస్ఆర్ జెండాలు తండాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జెండాలు తండాలో ఎండీ యాకూబ్ పాషా పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఆయన విధులకు హాజరై కార్యాలయంలో సర్పంచ్తో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో తండాకు చెందిన ధరవట్ చిరంజీవి అనే వ్యక్తి తాగి వచ్చి కార్యదర్శి, సర్పంచ్తో వాగ్వాదానికి దిగాడు. అనంతరం వారిపై రాళ్లతో దాడి చేశాడు. ఈ దాడిలో కార్యదర్శికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు ఫిర్యాదు అందటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






