దిశ, డోర్నకల్: తాగిన మైకంలో ఓ వ్యక్తి పంచాయతీ కార్యదర్శిపై దాడి చేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం డీఎస్ఆర్ జెండాలు తండాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జెండాలు తండాలో ఎండీ యాకూబ్ పాషా పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఆయన విధులకు హాజరై కార్యాలయంలో సర్పంచ్తో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో తండాకు చెందిన ధరవట్ చిరంజీవి అనే వ్యక్తి తాగి వచ్చి కార్యదర్శి, సర్పంచ్తో వాగ్వాదానికి దిగాడు. అనంతరం వారిపై రాళ్లతో దాడి చేశాడు. ఈ దాడిలో కార్యదర్శికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు ఫిర్యాదు అందటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మద్యం మత్తులో పంచాయతీ కార్యదర్శిపై దాడి
గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబర్ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..