వైద్యులపై దాడి.. పాజిటివ్ రావడంతో సారీ !

by  |
వైద్యులపై దాడి.. పాజిటివ్ రావడంతో సారీ !
X

దిశ, హైదరాబాద్: కరోనా పరీక్ష నిర్ధారణ అయ్యే వరకూ ఆస్పత్రిలో ఉండాలన్నా.. ఉస్మానియా వైద్యులపై దాడి చేసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కరోనా లక్షణాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చేరగా వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే రిపోర్టులు వచ్చేవరకు ఉండాలని సూచించగా అందుకు నిరాకరించి, వైద్యులపై రోగి తండ్రి దాడి చేశారు. అనంతరం అతనికి కరోనా పాజిటివ్ అని తేలడంతో పేషెంట్ తండ్రి వైద్యులకు సారీ చెప్పాడు. ఈ విషయం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వరకు చేరడంతో ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. వైద్యులపై దాడి చేయడాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు.

Tags: Corona Virus, Osmania Hospital, Corona, Positive, Attack on Doctors, Minister Etela Rajender

Next Story

Most Viewed