పొగ తాగొద్దంటే పన్ను విరగొట్టాడు

by  |
పొగ తాగొద్దంటే పన్ను విరగొట్టాడు
X

దిశ, కంటోన్మెంట్: తన ఇంటిముందు ధూమపానం చేయొద్దన్న వ్యక్తిపై దాడి చేసిన ఘటన బోయిన్‌పల్లి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ రవికుమార్ కథనం ప్రకారం.. సిఖ్ విలేజ్‌‌కు చెందిన ముత్తుస్వామి వ్యాపారి. శుక్రవారం మధ్యాహ్నం ముత్తుస్వామి తన ఇంటిముందు కూర్చున్నాడు. ఇదే సమయంలో స్థానికంగా నివసించే అండ్ర్యూ ముత్తిస్వామి ఇంటిముందు ధూమపానం చేస్తున్నాడు. తన ఇంటి ముందు పొగ తాగొద్దని బాధితుడు అండ్ర్యూకు వారించాడు. దీంతో కొపోద్రిక్తుడైన అండ్ర్యూ గొడవకు దిగి అందుబాటులో ఉన్న రాయితో దాడి చేశాడు. అనంతరం అండ్ర్యూ తమ్ముడు జేమ్స్ సైతం బాధితునితో గొడవ పడ్డాడు. ఈ గొడవలో బాధితుడి పన్ను విరిగిందని సీఐ తెలిపారు.

Next Story

Most Viewed