మసీదుపై ఆత్మహుతి దాడి.. 50 మంది మృతి

by  |
Attack, mosque
X

దిశ, వెబ్‌డెస్క్‌: అరాచక తాలిబన్ల పాలనలో అఫ్ఘానిస్తాన్‎ అతలాకుతలం అవుతోంది. వరుస దాడులతో నెత్తురోడుతోంది. తాజాగా.. అఫ్ఘానిస్తాన్‎లోని కుందూజ్ ప్రాంతంలో సయ్యద్ అబాద్ మసీదుపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. దాడి సమయంలో మసీదులో వందలాది మంది ముస్లీంలు ఉన్నట్లు సమాచారం. శుక్రవారం కావడంతో ప్రార్థనలో ప్రజలు ఎక్కువమంది పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం భారీ దాడి జరగడంతో దాదాపు 50 మంది వరకూ మరణించి ఉంటారని భావిస్తున్నారు. మరో 200 మందికి పైగా తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఘటననపై తాలిబన్ ప్రభుత్వం ప్రధాన అధికార ప్రతినిధి జబిహుల్లా ముహాజిద్ ప్రకటన విడుదల చేశారు.


Next Story

Most Viewed