కూకట్ పల్లి ఏటీఎం దొంగలు దొరికారు.. సీపీ ప్రెస్‌మీట్!

by  |
కూకట్ పల్లి ఏటీఎం దొంగలు దొరికారు.. సీపీ ప్రెస్‌మీట్!
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని కూకట్ పల్లిలో ఏప్రిల్ 29వ తేదీన హెచ్‌డీఎఫ్‌‌సీ ఏటీఎం చోరీకి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దొంగలను అడ్డుకోవాలని ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డుపై దుండగులు కాల్పులు జరిపారు. దీంతో సెక్యూరిటీ గార్డు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చోరీ ఘటనలో రూ.5 లక్షలను నిందితులు అపహరించినట్లు సమాచారం. అయితే, అదే రోజు సాయంత్రం నిందితులను సంగారెడ్డి బోర్డర్ వద్ద పోలీసులు పట్టుకున్నారు.

విచారణ అనంతరం బుధవారం దొంగలను మీడియా ముందుకు తీసుకొచ్చారు. నిందితులు బీహార్‌కు చెందిన ముఖేశ్ కుమార్, అభిజిత్ కుమార్‌లుగా గుర్తించారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దోపిడి జరిగిందని సైబరాబాద్ సీపీ సజ్జన్నార్ తెలిపారు. నిందితుల అరెస్టుతో మొత్తం నాలుగు కేసుల మిస్టరీలు వీడాయని సీపీ తెలిపారు . తొలుత వీరు గన్ తో బెదిరించి డబ్బులు దొంగించాలనుకున్నారని వివరించారు.

Next Story

Most Viewed