అబ్బాయ్ స్పీచ్.. భావోద్వేగానికి గురైన అచ్చెన్నాయుడు (వీడియో)

by  |
అబ్బాయ్ స్పీచ్.. భావోద్వేగానికి గురైన అచ్చెన్నాయుడు (వీడియో)
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బాహుబలి అంటూ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అభివర్ణించారు. తన తండ్రి దివంగత ఎర్రన్నాయుడుని చంద్రబాబు ఆదరించి మహోన్నతమైన స్థానం కల్పించారని.. అదే స్థానాన్ని తన బాబాయ్ అచ్చెన్నాయుడుకు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఎర్రన్నాయుడు బాటలో బాబాయ్ అచ్చెన్నాయుడు, నేను పయనిస్తున్నట్లు తెలిపారు. అచ్చెన్నాయుడు రాత్రి పగలు అనే తేడాలేకుండా కార్యకర్తల కోసం పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు కీలక సూచనలు చేశారు. రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని అప్పుడు తన బాబాయ్ అచ్చెన్నాయుడుకు తగిన హోదా ఇవ్వాలని కోరారు. తగిన హోదా ఇస్తే ఇప్పుడు రెచ్చిపోయిన వాళ్ల తాట తీస్తారని చెప్పుకొచ్చారు. అప్పటి వరకు అచ్చెన్నాయుడు నిద్రపోరని తెలిపారు. నేను ఎంతో సాఫ్ట్ అని, ప్రజల కోసం అన్నీ సహిస్తున్నానని తెలిపారు. కానీ అచ్చెన్నాయుడు తనకు భిన్నమన్నారు.

మనిషి ఎంత గంభీరమో లోపల కూడా అంతే గంభీరంగా ఉంటారని వెల్లడించారు. అయితే సంస్కారం వల్ల ప్రశాతంగా ఉంటున్నారని కానీ లోపల మాత్రం రగులుతోందన్నారు. అచ్చెన్నాయుడు సత్తా ఏంటో రాబోయే రోజుల్లో చూపిస్తారని అందుకు చంద్రబాబు సహకరించాలని రామ్మోహన్ నాయుడు కోరారు. జగన్ పిరికివాడు కాబట్టే దాడులకు పాల్పడుతున్నాడన్న రామ్మోహన్ నాయుడు, ఈ దాడులు ఇప్పటితో ఆగిపోవన్నారు. మరింత పెరుగుతాయని వాటిని చిరునవ్వుతో స్వీకరించాలని సూచించారు. రామ్మోహన్ నాయుడు స్పీచ్ విన్న అచ్చెన్నాయుడు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. రామ్మోహన్ నాయుడును హత్తుకున్నారు. బాబాయ్ అబ్బాయ్ లిద్దరూ ఆలింగనం చేసుకోవడంతో అభిమానులు ఫోన్లకు పనిచెప్పారు. క్లిక్ మంటూ తమ సెల్‌ఫోన్‌లో ఆ దృశ్యాలను బంధించారు.



Next Story

Most Viewed