హెచ్‌డి కుమారస్వామి కొడుకు పెళ్లి వేడుకలో నో సోషల్ డిస్టెన్!

by  |
హెచ్‌డి కుమారస్వామి కొడుకు పెళ్లి వేడుకలో నో సోషల్ డిస్టెన్!
X

బెంగళూరు : మాజీ ప్రధాని హెచ్‌డి దేవేగౌడ మనవడు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడి పెళ్లి వేడుకలో అతిథులు లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమించారు. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోల్లో అతిథులు మాస్కులు లేకుండా సామాజిక దూరాన్ని పాటించకుండా గుంపులుగా కనిపించారు. జనతా దళ్(సెక్యులర్) నేత హెచ్‌డి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి.. కాంగ్రెస్ నేత ఎం కృష్ణప్ప మనవరాలు రేవతిని శుక్రవారం వివాహమాడారు. లాక్‌డౌన్ ప్రకటించకముందు రామానగర జిల్లాలోని జనపద లోకా సమీపంలో 92 ఎకరాల విస్తీర్ణంలో అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకలు నిర్వహించేందుకు కుమారస్వామి కుటుంబం ప్లాన్ చేసుకుంది. కానీ, లాక్‌డౌన్ నేపథ్యంలో ప్లేస్‌ను కుమారస్వామి నియోజకవర్గానికి మార్చుకుంది. పెళ్లికి ఒకరోజు ముందు కుమారస్వామి చేసిన ఓ ప్రకటనలో.. ఈ వివాహ వేడుకకు అతిథులుండబోరని, కేవలం 60 నుంచి 70 మంది బంధువులు మాత్రమే ఉంటారని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ వేడుకకు పార్టీ కార్యకర్తలు హాజరుకావొద్దని, లాక్‌డౌన్ ఎత్తేశాక.. వధూవరులతో గ్రాండ్ పార్టీ నిర్వహిస్తామని అందులో అందరూ వారిని ఆశీర్వదించవచ్చునని తెలిపారు. కాగా, వివాహానికి 42వాహనాలకు, 120 మందికి పాస్‌లు ఇచ్చినట్టు కర్ణాటక పోలీసులు తెలిపారు. ఒక వేళ ఈ వేడుకలో సామాజిక దూరాన్ని పాటించలేదని నిర్ధారణ అయితే.. రెండో ఆలోచన లేకుండా కుమారస్వామిపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ తెలిపారు.

Tags: hd kumaraswamy, social distance, flouts, lockdown, rules, karnataka

Next Story

Most Viewed