వర్షాల నేపథ్యంలో అసెంబ్లీ రెండ్రోజులు వాయిదా?

by  |
ts-assembly
X

దిశ, తెలంగాణ బ్యూరో: గులాబ్ తూఫాన్ ప్రభావంతో రెండ్రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ, మండలి సమావేశాలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులంతా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో వర్షాలు కురుస్తుండటంతో అధికారులు చర్యలు చేపడుతున్నప్పటికీ.. వీరు కూడా స్థానికంగా ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చర్యలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు.

దీంతో మంగళవారం మధ్యాహ్నం వరకు సభ నిర్వహించిన అనంతరం స్పీకర్ అధ్యక్షతన అఖిల పక్షంతో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో రెండ్రోజుల పాటు సభను వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో మండలి, శాసనసభ్యులు స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించనున్నారు. నిరంతరం పర్యవేక్షణ చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.



Next Story

Most Viewed