అస్సాంలో ఎన్నార్సీ డేటా మాయం

by  |
అస్సాంలో ఎన్నార్సీ డేటా మాయం
X

అస్సాంలో జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ) కోసం సేకరించిన డేటా సంబంధిత వెబ్‌సైట్‌లో కనిపించడం లేదు. ఇలా ఉన్నట్టుండీ డేటా మాయమవ్వడం పట్ల అధికార బీజేపీని ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శించింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆరోపించింది. అయితే, క్లౌడ్‌లో చిన్నపాటి సాంకేతిక లోపం తలెత్తిందనీ, అందుకే డేటా కనిపించట్లేదని సంబంధిత అధికారులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామనీ, డేటా భద్రంగానే ఉంటుందని హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed