ఆశా కార్యకర్తలకు ఇన్సెంటివ్‌లు ఇవ్వాలి

by  |
ఆశా కార్యకర్తలకు ఇన్సెంటివ్‌లు ఇవ్వాలి
X

దిశ, ఆదిలాబాద్: కరోనా కట్టడిలో ముందు వరుసలో నిలబడి సేవలందిస్తున్న ఆశా కార్యకర్తలకు నెలకు రూ.5వేల చొప్పున ఇన్సెంటివ్ లు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు పట్టించుకోవడం లేదని తెలంగాణ ఆశా కార్యకర్తల సంఘం ఆరోపించింది. ఈ మేరకు సోమవారం నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు చంద్రకళ ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చినట్టుగానే ఆశా కార్యకర్తలకు రూ. 5వేల ఇన్సెంటివ్ ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు రూ. 750 రూ. వెయ్యితో సరి పెడుతోందని విమర్శించారు. అది కూడా అందరూ ఆశా కార్యకర్తలకు సక్రమంగా ఇవ్వలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకుులు దాదే మియా పాల్గొన్నారు.

Next Story