ఏషియన్ రోయింగ్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం గెలిచిన అర్జున్ లాల్, రవి

by  |
ఏషియన్ రోయింగ్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం గెలిచిన అర్జున్ లాల్, రవి
X

దిశ, స్పోర్ట్స్: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ వేదికగా నిర్వహిస్తున్న ఏషియన్ రోయింగ్ చాంపియన్‌షిప్స్ 2021లో భారత పురుషుల డబుల్స్ జోడి అర్జున్ లాల్ జాట్ – రవి స్వర్ణ పతకం సాధించాడు. శనివారం రాయల్ థాయ్ నేవీ రోయింగ్ సెంటర్‌లో జరిగిన జరిగిన డబుల్స్ స్కల్ ఈవెంట్‌లో భారత రోయర్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. చైనాకు చెందిన క్వింగ్ లీ- లుటోంగ్ ఝాంగ్, ఉజ్బెకిస్తాన్‌కు చెందిన డావ్జోన్ – అబ్దుల్లో లను ఓడించి స్వర్ణ పతకం సాధించారు. భారత జోడి 6 నిమిషాల 57 సెకెన్లలో లక్ష్యాన్ని చేరారు. చైనా జోడీ 7 నిమిషాల 2 సెకెన్లలో చేరి రజత పతకం, ఉజ్బెకిస్తాన్ జోడి 7 నిమిషాల 7 సెకెన్లలో లక్ష్యాన్ని చేరుకొని కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఇక మెన్స్ సింగిల్స్ స్కల్‌ ఈవెంట్‌లో భారత రోయర్ పర్మీందర్ సింగ్ రజత పతకం గెలుచుకున్నాడు. ఈ ఈవెంట్‌లో ఉజ్బెకిస్తాన్ రోయర్ స్వర్ణ పతకం, ఇండోనేషియా రోయర్ కాంస్య పతకాలు సాధించారు.

Next Story

Most Viewed