కోహ్లీ ఆ బంతులను వదిలేయాలి: ఆశిష్ నెహ్రా కీలక సూచన

by  |
కోహ్లీ ఆ బంతులను వదిలేయాలి: ఆశిష్ నెహ్రా కీలక సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: సౌతాఫ్రికాతో టెస్టు మ్యాచులో విరాట్ కోహ్లీ 35 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ వ్యవహారంపై టీమిండియా మాజీ ఫేస్ బౌలర్ ఆశిష్ నెహ్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు. కోహ్లీ టెంప్ట్ అయ్యి వికెట్ చేజార్చుకున్నాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు. కేఎల్ రాహుల్ సఫారీ బౌలర్లు విసిరిన ఆఫ్ స్టంప్ బంతులను వదిలేసినట్టుగానే.. విరాట్ కోహ్లీ కూడా వదిలేస్తే బాగుండేదన్నాడు. ఇక మీదట అయినా కోహ్లీ అటువంటి బంతులను వదిలేస్తే భారీ పరుగులు తీయగలడని చెప్పుకొచ్చాడు. నిజానికి అతడు ఒక స్టార్ బ్యాటర్ అని.. సెంచరీలు, డబుల్ సెంచరీలు చేయగలడని విరాట్ ను నెహ్రా కొనియాడాడు.


Next Story

Most Viewed