- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, క్రైమ్ బ్యూరో: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్సాగర్ వద్ద జరిగిన సత్యనారాయణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరాల ఆధారంగా.. హత్య చేసింది రాజేంద్రనగర్ దర్గా ఖాలీజ్ ఖాన్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అజీజ్(పాత నేరస్థుడు)గా గుర్తించారు. లాక్డౌన్ కారణంగా ఎలాంటి పనులు లేకపోవడంతో.. చేతి ఖర్చుల కోసం దొంగతనాలు చేయాలని భావించినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే మే నెలలో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో నగదును దొంగిలించేందుకు ప్రయత్నం చేసి అజీజ్ విఫలమైనట్లు తెలుస్తోంది. దీంతో ఎలాగైన డబ్బు సంపాధించాలన్న దురాశతో.. ఈ నెల 6వ తేదీన కల్లు కాంపౌండ్లో పరిచయమైన సత్యనారాయణను మాయమాటలు హిమాయత్సాగర్లోని ఎవరూ ఉండని ప్రాంతానికి తీసుకెళ్లాడు. సత్యనారాయణను అక్కడే హత్య చేసిన అజీజ్ మృతుని వద్ద లభించిన రూ.4 వేలు తీసుకొని వెళ్ళాడు. ఈ కేసు విచారణలో శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు, లంగర్ హౌజ్ పోలీసులు, రాజేంద్రనగర్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.