సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ.. అలా దొరికాడు

by  |
cannabis seller
X

దిశ, కుత్బుల్లాపూర్: గంజాయి విక్రేత ను అరెస్ట్ చేసిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ రమేష్ కథనం ప్రకారం.. మేడ్చల్ జిల్లా దేవరాయాంజల్ కు చెందిన పరపతి సురేష్ కుమార్ (30) సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుంటాడు. అయితే సులువుగా డబ్బు సంపాదన కోసం గంజాయిని విక్రయించడం ప్రారంభించాడు. అయితే స్థానికంగా గల యువతకు విక్రయిస్తున్నారనే సమాచారంతో శనివారం పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు. అతని వద్ద 2.7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Next Story

Most Viewed