ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదం.. నాలుగో సైనికాధికారి కోసం గాలింపు

by  |
Army helicopter crash
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని సూలూరు-కోయంబత్తూరు మధ్య ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్‌లో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌తో పాటు మరో ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. హెలికాప్టర్‌ కూలిన తరువాత మంటలు చెలరేగాయి. తీవ్ర గాయాల పాలైన ముగ్గురు అధికారులను విల్లింగ్టన్‌ బేస్‌కు తరలించారు. నాలుగో సైనికాధికారి కోసం ఆర్మీ అధికారులు గాలిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంలో ఆర్మీ అధికారుల కుటుంబసభ్యులు కూడా ఉండటంతో దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆందోళన నెలకొంది. హెలికాఫ్టర్‌లో మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నారని, వీరిలో నలుగురు మరణించినట్లు వార్తలు వైరల్‌గా మారాయి.

Next Story

Most Viewed