అది అభినందనీయం

by  |
అది అభినందనీయం
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా దేశమంతటా వలస కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. ఓవైపు ఉన్నచోటు ఏమీ దొరకక.. మరోవైపు సొంత ఊర్లకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న ఢ్లిల్లీలోని ఆర్మీ కుటుంబాలు.. ఆకలితో అలమటిస్తున్న ఆ పేదల కడుపునింపారు. స్వయంగా వారే ఆహారాన్ని సిద్ధం చేసి, అనంతరం దానిని పొట్లాలుగా కట్టి ఢిల్లీ కంటోన్మెంట్ అధికారులకు, ఇతర ప్రభుత్వాలకు అందజేశారు. దీంతో వారు ఆ పొట్లాలను వలస కూలీలకు ఇచ్చి వారి కడుపునింపారు. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ ఆర్మీ కుటుంబాలను ప్రశంసిస్తున్నారు.

Tags: delhi, army family, helping, Cantonment officials, government officials, migrant workers, starved



Next Story

Most Viewed