23 నుంచి ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం

by  |
23 నుంచి ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్ కారణంగా బస్సు సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. జూన్‌లో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో తిరిగి బస్సులు రోడ్డెక్కాయి. కొన్నాళ్లకు అంత‌ర్రాష్ట్ర స‌ర్వీసులకు కూడా గ్రీన్ సిగ్న‌ల్ రావడంతో.. క‌ర్ణాట‌క‌-ఏపీ మ‌ధ్య అంత‌ర్రాష్ట్ర బ‌స్సు స‌ర్వీసులు న‌డిచాయి.. అయితే కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో బెంగళూరులో లాక్ డౌన్ విధిస్తున్నట్లు యడ్డీ సర్కార్ ప్రకటించింది. దీంతో మరోసారి బస్సు సర్వీసులకు బ్రేక్ పడింది. లాక్‌డౌన్ ఈ నెల 22తో ముగిసిపోనుండటంతో మళ్లీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌-క‌ర్ణాట‌క, బెంగ‌ళూరు మ‌ధ్య ఆర్టీసీ బ‌స్సులు తిరిగి ప్రారంభం కానున్నాయి. దాదాపు 120 నుంచి 150 ఆర్టీసీ స‌ర్వీసులు న‌డిచే అవ‌కాశం ఉంది.


Next Story

Most Viewed