ఐఎన్ఎస్ విరాట్ విచ్ఛిన్నంపై సుప్రీంకోర్టు స్టే

by  |
ఐఎన్ఎస్ విరాట్ విచ్ఛిన్నంపై సుప్రీంకోర్టు స్టే
X

న్యూఢిల్లీ: విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విరాట్ విచ్ఛిన్నాన్ని నిలిపేయాల్సిందిగా సుప్రీంకోర్టు స్టే ఆదేశాలనిచ్చింది. ఈ నౌకను మ్యూజియంగా మార్చాలని భావిస్తున్న ప్రైవేటు సంస్థ ఎన్విటెక్ మెరైన్ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారిస్తూ నౌక విచ్ఛిన్నంపై స్టే విధించింది. నేవీలో సుమారు మూడు దశాబ్దాలపాటు సేవలందించిన ఐఎన్ఎస్ విరాట్ విమాన వాహక నౌకను మ్యూజియంగా మార్చాలని భావిస్తున్నదని, అందుకు అనుమతినివ్వాలని కేంద్రాన్ని ఎన్విటెక్ సంస్థ అభ్యర్థించింది.

కానీ, ఐఎన్ఎస్ విరాట్‌ను మ్యూజియంగా మార్చడానికి నిరభ్యంతర పత్రాన్ని అందివ్వలేదు. దీంతో చివరి అవకాశంగా ఎన్విటెక్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా, ఈ అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాలను ఇచ్చింది.



Next Story