వైఎస్ వల్లే నేను ఎన్నికల అధికారినయ్యాను

by  |
వైఎస్ వల్లే నేను ఎన్నికల అధికారినయ్యాను
X

దిశ,వెబ్‌డెస్క్: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దివంగత నేత వైఎస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కడప జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఎన్నికల్ని ఆపాలంటూ 10 పిటిషన్లతో పాటు ఆఖరి ప్రయత్నంగా 10 రిట్ పిటిషన్లు దాఖలు చేసినట్లు చెప్పారు. అయితే ఈ స్థానిక ఎన్నికల్ని జరపనీయకుండా నన్ను ఏ శక్తి కూడా అడ్డుకోలేదన్నారు. అనంతరం తాను ఎన్నికల అధికారినయ్యానంటే అందుకు కారణం వైఎస్సారేనని కొనియాడారు. వైఎస్ బ్లెసింగ్స్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నట్లు చెప్పారు. నా పనితీరు మెచ్చుకొని వైఎస్ నన్ను తనవద్ద 3ఏళ్లపాటు ఫైనాన్స్ సెక్రటరీగా నియమించినట్లు గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత వైఎస్ తనని రాజ్భవన్‌కు పంపి ఆశీర్వదించినట్లు గుర్తు చేశారు. అలా ఏడేళ్లు రాజ్ భవన్ లో ప్రత్యేక అధికారిగా పనిచేసినట్లు చెప్పిన నిమ్మగడ్డ.. రాజ్భవన్ వల్లే తాను ఎన్నికల అధికారిని అయ్యాను అన్నారు. వైఎస్‌కు రాజ్యాంగం పట్ల గొప్ప గౌరవం ఉందని.. కీలక అంశాలలో భావ ప్రకటనా స్వేచ్ఛ కల్పించారన్నారని నిమ్మగడ్డ అన్నారు.



Next Story

Most Viewed