‘రాహుల్‌ను అడ్డుకోవడం అప్రజాస్వామికం’

by  |
‘రాహుల్‌ను అడ్డుకోవడం అప్రజాస్వామికం’
X

దిశ, వెబ్‌డెస్క్: హథ్రస్‌లో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అడ్డుకోవడంపై ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ తీవ్రంగా ఖండించారు. బాధితులను పరామర్శించడానికి వచ్చిన నేతలను అడ్డుకోవడం అప్రజాస్వామికం అన్నారు. తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలే వాంగ్మూలం ఇచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో నిజాన్ని కప్పిపుచ్చేందుకే అర్ధరాత్రి మృతదేహాన్ని కాల్చారని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed