ఎన్ఆర్ఐలు ఏపీకొచ్చారు!

by  |
ఎన్ఆర్ఐలు ఏపీకొచ్చారు!
X

దిశ, ఏపీ బ్యూరో : వందే భారత్‌ మిషన్‌లో భాగంగా 126 మంది భారతీయులతో చికాగో నుంచి వచ్చిన ఎయిర్‌ ఇండియా విమానం హైదరాబాద్‌కు చేరింది. లాక్‌డౌన్‌ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్రప్రభుత్వం మే 7న వందే భారత్‌ మిషన్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మే 16న 121 మందితో అమెరికాలోని న్యూయార్క్ నుంచి ఎయిర్‌ ఇండియా విమానం బయలుదేరింది. వీరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 31 మంది ఎన్ఆర్ఐలు రాష్ట్రానికి చేరుకున్నారు. చికాగో నుంచి శంషాబాద్‌కు చేరుకున్న వారు..ప్రత్యేక బస్సుల్లో విజయవాడకు వచ్చారు. ఎన్ఆర్ఐలకు కలెక్టర్ ఇంతియాజ్ స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక బస్సుల్లో వారి సొంత జిల్లాల్లో ఉన్నటువంటి క్వారంటైన్‌కు తరలించారు.



Next Story

Most Viewed