ఏపీలో క్రీడాకారులకు తీపికబురు

by  |
Minister Avanti Srinivas
X

దిశ, ఏపీ బ్యూరో: స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని ఏపీ క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. మంగళవారం టూరిజం శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉద్యోగాల భర్తీలో 2 శాతం మేర స్పోర్ట్స్ కోటాకు రిజర్వేషన్ ఉందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయాల్సిన పోస్టుల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. టూరిజం అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని నాలుగు టూరిజం సర్క్యూట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

రాయలసీమ, కృష్ణా-గుంటూరు, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర సర్క్యూట్ల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోందన్నారు. మూడు సర్క్యూట్లల్లో ఒబెరాయ్ హోటళ్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని.. ఫారెస్ట్ టూరిజం, టెంపుల్ టూరిజం వంటి వాటిపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టు మంత్రి వెల్లడించారు. ఇక ప్రతి జిల్లాలో టూరిజం ఫెస్టివల్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ప్రొత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.



Next Story

Most Viewed