AP News : ఎలా ఆదేశాలు ఇస్తారు?.. ఆనందయ్య మందుపై హైకోర్టులో విచారణ

by  |
AP News : ఎలా ఆదేశాలు ఇస్తారు?.. ఆనందయ్య మందుపై హైకోర్టులో విచారణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆనందయ్య మందును (Anandaiah Medicine) పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. ఆయుర్వేద కౌన్సిల్‌లో ఆనందయ్య రిజిస్ట్రర్ చేసుకోలేదని, మందుపై పరీక్షలు జరుపుతున్నామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 29న ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ వస్తాయని పేర్కొంది. అయితే మందు పంపిణీ ఆపాలని లోకాయుక్త ఎలా ఆదేశాలు ఇస్తుందని పిటిషనర్ ప్రశ్నించాడు.

ఆనందయ్యతో ప్రైవేట్‌గా మందు తయారుచేయిస్తున్నారని ఆరోపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కాగా ఆనందయ్య మందు పంపిణీపై సందిగ్ధత నెలకొంది. అధ్యయనం జరుగుతుండగా.. కేంద్ర ఆయుష్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత మందు పంపిణీ జరిగే అవకాశాలున్నాయి.


Next Story

Most Viewed