మద్యం అమ్మకాలపై పిటిషన్.. కొట్టేసిన హైకోర్టు

by  |
మద్యం అమ్మకాలపై పిటిషన్.. కొట్టేసిన హైకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. కరోనా నివారణకు ఏపీ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా కేసులు కంట్రోల్ కావడం లేదు. ఏపీలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అక్కడి జిల్లా యంత్రాంగం లాక్‌డౌన్ ప్రకటించాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి, తిరుపతి లాంటి ప్రాంతాల్లో ఇంకా పాక్షిక లాక్‌డౌన్ కొనసాగుతోంది.

అయితే, లాక్‌డౌన్ సమయంలో మద్యం అమ్మకాలు నిలిపివేసేలా ఉత్తర్వులు జారీచేయాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానిపై స్పందించిన కోర్టు ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని చెబుతూ పిటిషన్ కొట్టివేసింది. గతంలో ఇదే వ్యవహారంపై సుప్రీం వెలువరించిన తీర్పును ఇందులో ఉటంకించింది.

Next Story

Most Viewed