నిమ్మగడ్డకు ఏపీ హైకోర్టు మరో షాక్

by  |
nimmagadda
X

దిశ,వెబ్‌డెస్క్: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కు ఏపీ హైకోర్టు మరో సారి షాక్ ఇచ్చింది. తిరుపతి, రాయచోటి, పుంగనూరు, ఎర్రగుంట్లలో రీనామినేషన్‌కు ఎస్ఈసీ జారీ చేసిన ఆదేశాలు చెల్లవని హైకోర్టు చెప్పింది. ఈ మేరకు ఎస్ఈసీ జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు కొట్టి వేసింది. మున్సిపల్ ఎన్నికల్లో కొత్తగా నామినేషన్లకు అవకాశాలు ఇవ్వొద్దని హై కోర్టు ఆదేశించింది.

ప్రత్యర్థులు బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయలేక పోయిన వారికి రీ నామినేషన్‌కు ఏపీ ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. తిరుపతి‌లో 6 డివిజన్లు, పుంగనూరు మున్సిపాలిటీలో 3, కడప జిల్లా రాయచోటిలో 2 వార్డుల్లో రీనామినేషన్ వేసేందుకు 11 మందికి ఎస్ఈసీ అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed