ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

by  |
ap-govt
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమల శాఖ (ఫుడ్ ప్రాసెసింగ్ ) కార్యదర్శిగా ముకేశ్ కుమార్ మీనా, గవర్నర్ స్పెషల్ సీఎస్‌గా ఆర్పీ సిసోడియాను బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చింది. స్టేట్ ట్యాక్స్‌ చీఫ్‌ కమిషనర్‌గా రవిశంకర్‌ నారాయణ్‌, సీసీఎల్ఏ కమిషనర్‌(అప్పీల్స్)గా లక్ష్మీనరసింహంకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. పీయూష్ కుమార్‌ను జీఏడీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

Next Story