ఆ శాఖ వారికి పూర్తి జీతం ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం!

by  |
ఆ శాఖ వారికి పూర్తి జీతం ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం!
X

దిశ, అమరావతి: రాష్ట్రంలోని పురపాలక శాఖ ఉద్యోగులకు జూన్ నుంచి పూర్తి జీతం చెల్లించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కోవిడ్ 19 వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా మార్చి, ఏప్రిల్‌ నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు 50 శాతం తగ్గించి చెల్లిస్తోంది. కానీ, ప్రజారోగ్య విభాగంలో పని చేస్తున్న కార్మికులకు పూర్తి స్థాయిలో జీతాలను చెల్లిస్తున్నారు.

ఇదే క్రమంలో కరోనా నియంత్రణలో భాగంగా పురపాలక శాఖా అధికారుల నుంచి కార్యాలయ ఉద్యోగుల వరకు అత్యవసర సేవలుగా పరిగణించి పూర్తి వేతనం చెల్లించాలన్న ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలిస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. గ్యాస్‌ లీకేజీ దుర్ఘటన వల్ల ప్రస్తుతం విశాఖపట్నం పర్యటనలో ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వచ్చిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. అంతేకాకుండా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత వీలైనంత త్వరగా అందరికీ పూర్తిస్థాయి జీతాలు చెల్లించనున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌ డౌన్‌ కొనసాగుతున్న క్రమంలో గత రెండు నెలలుగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు తగ్గించి ఇస్తోంది. అయితే వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, పింఛన్‌దారులకు మాత్రమే ప్రభుత్వం పూర్తిస్థాయి వేతనాలు ఇస్తోంది. మిగిలిన ఉద్యోగులకు జీతాల్లో 50 శాతం, 10 శాతం మేర కోతలను విధిస్తూ వస్తోంది. అయితే వచ్చే నెల నుంచి పూర్తి స్థాయి వేతనాలు ఇవ్వనున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed