జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. అది కూడా విశాఖకే

by  |
జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. అది కూడా విశాఖకే
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలో కమాండ్ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. విశాఖలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విశాఖలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిలో కంట్రోల్‌ రూమ్‌ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే విజయవాడ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు కేటాయించిన రూ.13.80 కోట్లను విశాఖలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నిర్మాణానికి బదలాయించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.


Next Story