నేటి నుంచి ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్‌

by  |
నేటి నుంచి ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్‌
X

దిశ, వెబ్‎డెస్క్: ఏపీలో ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ ద్వారా సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకు గాను రాష్ట్రవ్యాప్తంగా 25 హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ర్యాంకుల వారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో విద్యార్థులు ఇళ్ల నుంచే ఆన్‌లైన్ ద్వారా సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కి హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. అత్యవసరమైతేనే హెల్ప్‌లైన్ సెంటర్లకి విద్యార్థుల రావాల్సి ఉంటుందని తెలిపారు.


Next Story

Most Viewed