గ్రేస్ క్యాన్సర్ రన్‎ను ప్రారంభించిన డీజీపీ

by  |
గ్రేస్ క్యాన్సర్ రన్‎ను ప్రారంభించిన డీజీపీ
X

దిశ, వెబ్‎డెస్క్: విజయవాడలోని బెంజి సర్కిల్‎లో గ్రేస్ క్యాన్సర్ రన్‎ను డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో గ్లోబల్ వర్చ్యవల్ రన్-2020 ను నిర్వహించారు. ఈ నేపథ్యంలో శనివారం 5కే రన్‎ను డీజీపీ ప్రారంభించి.. బెలూన్స్, పావురాలను ఎగురవేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఔత్సాహికులు రన్ లో పాల్గొన్నారు.

క్యాన్సర్‎పై అవగాహన కల్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లో గ్రేస్ క్యాన్సర్ రన్ నిర్వహిస్తోంది. ఇప్పటికే 1.3 మిలియన్ ప్రజలు ఈ రన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ క్యాన్సర్‎పై అవగాహన కలిగి ఉండాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు.

Next Story