‘ప్రజలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు’

by  |
‘ప్రజలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు’
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను, ఏపీ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రైతుల పంపు సెట్లకు మీటర్లు బిగించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. రైతుల నుంచి ప్రతిఘటన రాకముందే… మీటర్ల బిగింపు అంశాన్ని పునరాలోచించుకోవాలని మధు సూచించారు. ప్రజలను ఆదుకోవాలని కానీ, ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అన్నారు.

Next Story

Most Viewed