ఏపీలో కొత్తగా 6,341 కరోనా కేసులు.. మరణాలు ఎన్నంటే

by  |
AP corona Update
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 6,341 కరోనా కేసులు వెలుగుచూడగా, 57 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 67,629 యాక్టివ్ కేసులుండగా, ఇప్పటివరకు 12,224 మంది మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా కరోనాతో 12 మంది మృతి చెందగా.. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,247 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది.

Next Story