17 అంశాలపై ప్రధాని మోడీకి నివేదన

by Vadlamudi Anukaran |

<p>దిశ, ఏపీ బ్యూరో: ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో మంగళవారం సమావేశమైన సీఎం జగన్&#8230; 17అంశాలను నివేదించారు. కరోనా వైరస్ ప్రభావం, లాక్‌డౌన్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థ గురించి వివరించి ఆదుకోవాలని అభ్యర్థించారు. రాష్ట్రానికి ఉన్న ఆదాయ వనరులు, కావల్సిన రుణ సదుపాయాల కోసం అనుమతి కోరారు. మండలి రద్దు, న్యాయ వ్యవస్థలో ఎదురవుతున్న చిక్కులపై చర్చించినట్లు తెలుస్తోంది. దాదాపు 40 నిమిషాల పాటు ప్రధానితో సీఎం జగన్ సమావేశం జరిగింది. సీఎం వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, [&hellip;]</p>

17 అంశాలపై ప్రధాని మోడీకి నివేదన
X

దిశ, ఏపీ బ్యూరో: ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో మంగళవారం సమావేశమైన సీఎం జగన్… 17అంశాలను నివేదించారు. కరోనా వైరస్ ప్రభావం, లాక్‌డౌన్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థ గురించి వివరించి ఆదుకోవాలని అభ్యర్థించారు. రాష్ట్రానికి ఉన్న ఆదాయ వనరులు, కావల్సిన రుణ సదుపాయాల కోసం అనుమతి కోరారు. మండలి రద్దు, న్యాయ వ్యవస్థలో ఎదురవుతున్న చిక్కులపై చర్చించినట్లు తెలుస్తోంది. దాదాపు 40 నిమిషాల పాటు ప్రధానితో సీఎం జగన్ సమావేశం జరిగింది. సీఎం వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మోపిదేవి, భరత్, మిథున్‌రెడ్డి ఉన్నారు.

Next Story