ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. పోలవరం నిర్వాసితులకు రూ.10 లక్షల పరిహారం..

by  |
ap-cabinet meeting
X

దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో ఏపీ కేబినెట్ భేటీ జరుగుతోంది. మూడు గంటలకు పైగా మంత్రివర్గ సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశంలో ఆగస్టులో అమలు చేయనున్న నవరత్నాల పథకాలపై చర్చించారు. అలాగే జగనన్న విద్యాకానుక, నాడు-నేడు, శాటిలైట్‌ ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లు, ప్రీ హైస్కూళ్లు, హైస్కూళ్లు, హైస్కూల్‌ ప్లస్ ఏర్పాటుపై చర్చించారు. ఈ నెల 10న అమలు చేయనున్న ‘వైఎస్ఆర్‌ నేతన్న నేస్తం’ పథకంపై కూడా మంత్రి వర్గ సమావేశంలో చర్చించారు.

అలాగే పోలవరం నిర్వాసితుల ఆర్‌అండ్ఆర్‌ చెల్లింపులపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. రూ.10లక్షల పరిహారం చెల్లింపునకు రూ.550 కోట్ల విడుదల చేసేందుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపులు, క్లీన్ ఆంధ్రప్రదేశ్, జగనన్న స్వచ్ఛ సంకల్పానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ధార్మిక పరిషత్ కార్యనిర్వాహక కమిటీ ఏర్పాటుపై చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. అలాగే రైతుభరోసా కేంద్రాల ద్వారా విత్తనోత్పత్తి పాలసీని కేబినెట్ ఆమోదించింది.

మచిలీపట్నం, భావనపాడు పోర్టుల రివైజ్డ్‌ అంచనాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే బుడగట్లపాలెం, పూడిమడక, ఓడలేరు, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లోకాయుక్త కర్నూలుకు తరలించే ప్రతిపాదనకు, హెచ్‌ఆర్‌సీ కార్యాలయం కర్నూలులో ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.


Next Story

Most Viewed