నేడు ఏపీ కేబినెట్ విస్తరణ.. కొత్త మంత్రులుగా ఎవరంటే..?

by  |
నేడు ఏపీ కేబినెట్ విస్తరణ.. కొత్త మంత్రులుగా ఎవరంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: నేడు ఏపీ మంత్రి వర్గ విస్తరణ కానున్నది. మధ్యాహ్నం 1:29 నిముషాలకు మంత్రివర్గ విస్తరణ జరగనుంది. రెండు ఖాళీ స్థానాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. కొత్త మంత్రులతో గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ ప్రమాణం చేయించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం వైఎస్‌ జగన్‌ రాజ్‌భవన్‌కు చేరుకోనున్నారు. రాజ్యసభకు ఎన్నికైనందున సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ తమ మంత్రి పదవులకు చేసిన రాజీనామా చేయడంతో.. వారి స్థానాల్లో కొత్తవారిని తీసుకోనున్నారు.

Next Story

Most Viewed