మూడేళ్ల తర్వాత వైసీపీ ఉండదు..రాసిపెట్టుకోండి !

by  |
మూడేళ్ల తర్వాత వైసీపీ ఉండదు..రాసిపెట్టుకోండి !
X

దిశ, విశాఖపట్నం: బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మూడేళ్లలో వైసీపీ మూసేసే పార్టీ అని, గ్యారంటీగా చెబుతున్నా.. కావాలంటే రాసిపెట్టుకోండి’ అని విశాఖలో మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. మూసివేయడం అంటే ఆ పార్టీ అధికారంలో ఉండదని చెప్పుకొచ్చారు. గతంలో టీడీపీ ఓడిపోతుందని ముందే చెప్పానని, అదే జరిగిందని గుర్తుచేశారు. నోటికి వచ్చింది చెప్పడానికి తానేమీ కేఏపాల్‌ను కాదంటూ సెటైర్లు వేశారు. జగన్ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారని, ప్రజలకు ముద్దులు పెడితే నిజమైన ప్రేమ అనుకున్నారని, కానీ ఇఫ్పుడు అది కపట ప్రేమన్న విషయంగా తెలిసిందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే లోపల వేస్తున్నారని ఆరోపించారు.

Next Story

Most Viewed