తల్లిదండ్రులు కాబోతున్న విరుష్క జంట

by  |
తల్లిదండ్రులు కాబోతున్న విరుష్క జంట
X

దిశ, వెబ్ డెస్క్:

అందాల భామ అనుష్క శర్మ, హ్యాండ్సమ్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చాలా హ్యాపీగా ఉన్నారు. ఫ్యాన్స్‌కు అమేజింగ్ న్యూస్ చెప్పిన ఈ క్యూట్ అండ్ లవబుల్ కపుల్.. త్వరలో ఇద్దరం ముగ్గురం కాబోతున్నామని, జనవరి 2021లో ఇంటికి కొత్త గెస్ట్‌ను ఇన్‌వైట్ చేయబోతున్నామని తెలిపారు. తాము తల్లిదండ్రులం కాబోతున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇద్దరూ జంటగా దిగిన ఫొటోను పోస్ట్ చేసి ఈ హ్యాపీ న్యూస్ షేర్ చేసుకున్నారు. దీంతో ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉండగా.. శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చోటా విరాట్ రాబోతున్నాడని ఖుష్ అవుతున్నారు విరుష్క జంట అభిమానులు. ఈ సందర్బంగా పరిణీతి చోప్రా, అలియా భట్, పూజా హెగ్డే, తాప్సీ లాంటి సెలెబ్రిటీలు కంగ్రాట్స్ చెప్పారు.

డిసెంబర్ 11, 2017లో విరుష్క దంపతుల పెళ్లి కాగా.. మోస్ట్ అండర్‌స్టాండింగ్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇద్దరూ కూడా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కాగా అనుష్క చివరగా 2019లో వచ్చిన ‘జీరో’ సినిమాలో కనిపించగా ఇప్పుడు నిర్మాతగా మారింది. పాతాళ్‌లోక్, బుల్ బుల్ సిరీస్‌లతో సక్సెస్ అందుకుంది.

https://www.instagram.com/p/CEYZINOpd53/?igshid=15mm0z2mqywst

Next Story