తండ్రిపై ‘మీటూ’ ఆరోపణలు.. స్పందించిన అలియా

by  |
తండ్రిపై ‘మీటూ’ ఆరోపణలు.. స్పందించిన అలియా
X

దిశ, సినిమా: బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌పై గతేడాది మీటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా తన తండ్రిని తప్పుగా చిత్రీకరించడంపై కూతురు అలియా కశ్యప్ బాధపడినట్టు చెప్పింది. ఆయన క్యారెక్టర్ టెర్రిబుల్‌గా ఉంటుందని అందరూ అనుకుంటారన్న అలియా.. నిజానికి ఆయన ఒక ‘టెడ్డీ బేర్’ లాంటివాడనే విషయం దగ్గరి నుంచి చూసిన వారికి మాత్రమే తెలుసని వెల్లడించింది. తమ జీవితాల్లో ఏమీ సాధించలేని వ్యక్తుల నుంచే ఇలాంటి ద్వేషపూరిత కామెంట్లు వినిపిస్తాయని, అవి తన వరకు కూడా వస్తాయని తెలిపింది. అయితే ఆందోళన కలిగించే విషయాలను తనకు దూరంగా ఉంచేందుకే అనురాగ్ ప్రయత్నిస్తాడని పేర్కొంది. కాగా ‘బాంబే వెల్వెట్’ చిత్రం నిర్మించే సమయంలో అనురాగ్ తనను బలవంతం చేశాడని గతేడాది ఒక నటి ట్వీట్ చేసిన ట్వీట్‌కు జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖ శర్మ కూడా మద్దతు తెలిపింది. అయితే తనపై మోపిన అభియోగాలన్నీ నిరాధారమైనవని ట్విట్టర్‌ ద్వారా తెలిపిన అనురాగ్.. మీటూ ఆరోపణలు ఖండిస్తూ ప్రకటన విడుదల చేశారు.

అతనితో ప్రియమణి మ్యారేజ్ చెల్లదు : మాజీ భార్య



Next Story

Most Viewed