‘నిన్ను కోరి’ రీమేక్ లో అనుపమ, అధర్వ

by  |
‘నిన్ను కోరి’ రీమేక్ లో అనుపమ, అధర్వ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రెట్టి హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తమిళ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది. అధర్వ మురళి, అమితాష్ ప్రధాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘తల్లి పొగతే’. నేచురల్ స్టార్ నాని ‘నిన్ను కోరి’ సినిమా రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో అధర్వ నాని క్యారెక్టర్ ప్లే చేస్తుండగా.. అమితాష్ ఆది పినిశెట్టి పాత్రలో కనిపించనున్నాడు.

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ రిలీజ్ చేసిన తల్లి పొగతే ట్రైలర్ ఆకట్టుకోగా..అధర్వ మురళి, అనుపమ నేచురల్ యాక్టింగ్‌తో ఇరగదీశారు. ఆర్.కణ్ణన్ డైరెక్ట్ చేసి నిర్మిస్తున్న సినిమాకు గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. ఇక అధర్వ నానిని రీప్లేస్ చేయగలడని..లవర్ బాయ్ అన్ని జోనర్స్‌కు సెట్ అవుతాడని.. మెప్పిస్తాడని అంటున్నారు ఫ్యాన్స్. అయితే, సినిమా ఓటిటీలో రిలీజ్ చేస్తారా లేక థియేటర్స్ లోనే విడుదల చేస్తారా? అనే దానిపై త్వరలో క్లారిటీ ఇవ్వనుంది మూవీ యూనిట్.



Next Story

Most Viewed