అవినీతిపై జగన్ పోరాటం.. సింధు సందేశం

by  |
అవినీతిపై జగన్ పోరాటం.. సింధు సందేశం
X

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ శాఖల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి ఉండకూడదని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అవినీతిని అరికట్టేందుకు, అవినీతిపై సమాచారం అందించేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 14400 నెంబర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్‌ ప్రచార వీడియోను జగన్ విడుదల చేశారు. ఈ వీడియోలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కనిపిస్తుంది..అందులో ‘అవినీతిరహిత సమాజం కోసం ఏపీ సీఎం జగన్ కృషి చేస్తున్నారు. ఎవరు అవినీతికి పాల్పడినా మీ గొంతు వినిపించండి. వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 14400కు ఫోన్ చేసి సమాచారమివ్వండి’ అని పేర్కొంటూ కనిపిస్తుంది. చట్టవ్యతిరేక కార్యకలాపాలు, ఇసుక మాఫియాకు దూరంగా ఉండాలని సీఎం పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed