మేడ్చల్: బ్లాక్ ఫంగస్‌తో వ్యక్తి మృతి

by  |
మేడ్చల్: బ్లాక్ ఫంగస్‌తో వ్యక్తి మృతి
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: తెలంగాణలో బ్లాక్ ఫంగస్‌తో మరో వ్యక్తి మృతి చెందారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్ పట్టణానికి చెందిన దొడ్ల లక్ష్మీనారాయణ(47) అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా బ్లాక్ ఫంగస్ తో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. మేడ్చల్ మండలంలో బ్లాక్ ఫంగస్ తో మృతి చెందిన మొదటి వ్యక్తి దొడ్ల లక్ష్మీనారాయణ ముదిరాజ్ అని స్థానికులు తెలియజేశారు.

ఒకవైపు కరోనా వైరస్ వ్యాధితో ప్రజలు బయటపడుతుంటే మరోవైపు బ్లాక్ ఫంగస్ వ్యాధి ప్రజలను బయబ్రాంతులకు గురిచేస్తుంది.వెంటనే వైద్యాధికారులు బ్లాక్ ఫంగస్ వ్యాధి నిర్మూలన కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మున్సిపల్ పట్టణ ప్రజలు తెలిపారు.

Next Story

Most Viewed