సజ్జనార్ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు పండుగే..

by  |
MD sajjanar
X

దిశ, డైనమిక్ బ్యూరో : సైబరాబాద్ సక్సెస్‌ఫుల్ కమిషనర్ గా పేరుతెచ్చుకున్న వీసీ సజ్జనార్, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని తిరిగి లాభాల బాటలో నడిపేందుకు ఎండీగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రజలందరినీ ఆకట్టుకునే విధంగా స్టేట్మెంట్స్ ఇచ్చి అందరి మన్ననలు పొందారు. ఈ క్రమంలో సుదూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పండుగల సమయంలో బస్సు టికెట్లు బుక్ అవ్వక ఇబ్బందులు పడుతున్న వారికి శుభవార్త చెప్పారు.

రాబోయే దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ అధికారులు బస్ టికెట్ బుకింగ్ లను ముందుగానే బుక్ చేసుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇకపై ప్రయాణికులు ఏ రోజు వెళ్లాలనుకుంటున్నారో, ఆరోజు కంటే నెల రోజుల ముందు నుంచే బస్ టికెట్ ను బుక్ చేసుకోవచ్చు. ప్రైవేటు బస్ సర్వీసులకు ధీటుగా అన్ని సదుపాయాలు కల్పిస్తూ సంస్థకు పునర్వైభవం తీసుకొచ్చేందుకు ఇలాంటి మరెన్నో చర్యలు తీసుకోనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.


Next Story