అడవిలో అగ్ని ప్రమాదం: మరో ఆదివాసీ మృతి

by  |
అడవిలో అగ్ని ప్రమాదం: మరో ఆదివాసీ మృతి
X

దిశ, అచ్చంపేట: నల్లమల ఏజెన్సీ అమ్రాబాద్ మండలంలోని మల్లాపూర్ చెంచు పెంటకు చెందిన 11 మంది ఆదివాసీలు ఇటీవల అడవిలో చెలరేగిన మంటల్లో చిక్కుకొని గాయపడిన విషయం తెలిసిందే. వారిలో నలుగురు హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఈ నెల 13న నిమ్మల లింగయ్య మృతి చెందాడు. బుధవారం కాట్రాజు ఎల్లయ్య (45) సైతం పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. మృతుడికి ముగ్గురు కుమారులు ఉండగా, భార్య అనారోగ్య కారణాలతో రెండేళ్ల క్రిందట మృతి చెందిందని బంధువులు తెలిపారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఐదు రోజుల వ్యవధిలోనే ఇద్దరు వ్యక్తులు చనిపోవడంతో చెంచు కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.



Next Story