ప్రమాదం జరిగింది.. కరోనా బయటపడింది 

by  |
ప్రమాదం జరిగింది.. కరోనా బయటపడింది 
X

దిశ, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జిల్లా పరిధిలోని నవాబుపేట మండలం పల్లెగడ్డ గ్రామానికి చెందిన వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వివరాల ప్రకారం పల్లెగడ్డ గ్రామానికి చెందిన వ్యక్తికి 15 రోజుల క్రితం కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరులో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అతనిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. అనుమానంతో కోవిడ్ పరీక్షలు నిర్వహించగా అతనికి పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు తెలిపారు.

Next Story

Most Viewed