నిజామాబాద్‌లో మరో 8 మందికి కరోనా

by  |
నిజామాబాద్‌లో మరో 8 మందికి కరోనా
X

దిశ, నిజామాబాద్: నిజామాబాద్‌ జిల్లాలో మరో ఎనిమిది మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు కలెక్టర్ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం నాటికి 39 కేసులు ఉండగా బుధవారం రాత్రి మరో ఎనిమిది పాజిటివ్ కేసులు నమోదయ్యాని చెప్పారు. వీటితో కలిపి జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 47 పాజిటివ్ కేసులు ఉన్నాయని వివరించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రభుత్వ సూచనలు పాటించాలని పేర్కొన్నారు.

Tags;corona virusn,Nizamabad,collector narayan reddy,8 corona positve cases



Next Story