ఒక్కరోజే 304 కొత్త కేసులు.. ఇద్దరు మృతి

by  |
coronavirus
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా, 15,173 శాంపిళ్లను పరీక్షించగా, అత్యధికంగా 304మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది.

కొత్తగా నమోదైనా కేసుల్లో 246 మంది ఏపీ వాసులుండగా, 58మంది ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వచ్చినవారున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,456కు చేరింది. వీరిలో రాష్ట్రానికి చెందినవారు 5,087మంది ఉండగా, ఇతర దేశాల నుంచి వచ్చినవారు 210మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 1,159మంది ఉన్నారు.

ఆదివారం ఉదయం 9గంటల నుంచి సోమవారం ఉదయం 9గంటల వరకు 47మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 2,770కి పెరిగింది. వైరస్ బారినపడి కొత్తగా కర్నూల్ జిల్లాకు చెందిన ఒకరు, అనంతపూర్ జిల్లాకు చెందిన ఒకరు మృతిచెందగా, మొత్తం మృతుల సంఖ్య 86కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,231 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Next Story