ఏపీలో తాజాగా మరో 15 కేసులు

by  |
ఏపీలో తాజాగా మరో 15 కేసులు
X

ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకూ 19 శాంపిల్స్‌ను పరీక్షించగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. తాజాగా నెల్లూరులో 6, కృష్ణాజిల్లా 6, చిత్తూరులో 3 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 329కి పెరిగాయి. ఏపీ ఇప్పటి వరకు కరోనాతో నలుగురు మృతి చెందగా, ఆరుగురు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. అత్యధికంగా కర్నూలులో 74 కేసులు నమోదు అయ్యాయి.

Tags: corona, positive cases 15, ap nellore, krishna, chittoor

Next Story

Most Viewed