కొత్తగా మరో 13 యూకే వేరియంట్ కేసులు

by Shamantha N |

<p>న్యూఢిల్లీ: భారత్‌లో బుధవారం కొత్తగా మరో 13 యూకే వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యూకే వేరియంట్ కేసుల సంఖ్య మన దేశంలో 71కి చేరాయి. మంగళవారం కొత్తగా 20 కేసులు రిపోర్ట్ కావడంతో మొత్తం కేసులు 58కి చేరిన సంగతి తెలిసిందే. యూకే నుంచి వచ్చి కరోనా పాజిటివ్‌గా నిర్ధారితమైన 13 మంది కొత్త రకం కరోనాతో బాధపడుతున్నారని తెలిసినట్టు బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్ సెక్రెటరీ రేణు స్వరూప్ తెలిపారు. ఇప్పటి వరకు ఇండియాలో 71 [&hellip;]</p>

కొత్తగా మరో 13 యూకే వేరియంట్ కేసులు
X

న్యూఢిల్లీ: భారత్‌లో బుధవారం కొత్తగా మరో 13 యూకే వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యూకే వేరియంట్ కేసుల సంఖ్య మన దేశంలో 71కి చేరాయి. మంగళవారం కొత్తగా 20 కేసులు రిపోర్ట్ కావడంతో మొత్తం కేసులు 58కి చేరిన సంగతి తెలిసిందే.

యూకే నుంచి వచ్చి కరోనా పాజిటివ్‌గా నిర్ధారితమైన 13 మంది కొత్త రకం కరోనాతో బాధపడుతున్నారని తెలిసినట్టు బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్ సెక్రెటరీ రేణు స్వరూప్ తెలిపారు. ఇప్పటి వరకు ఇండియాలో 71 యూకే వేరియంట్ కేసులను గుర్తించినట్టు వివరించారు. వీరందరినీ ప్రభుత్వం గుర్తించిన హెల్త్ కేర్ ఫెసిలిటీలోని సింగిల్ రూం ఐసొలేషన్‌లో ఉంచినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. వారి కాంటాక్టులనూ క్వారంటైన్‌లో ఉంచినట్టు వివరించింది. ఇతర నమూనాలపై జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టులు జరుగుతున్నాయని తెలిపింది.

Next Story